నేడు నెల్లూరు

Monday, May 3, 2010

సీఎం సభలో హైడ్రామా

సీఎం సభలో రాజకీయ హైడ్రామా న డిచింది. కొంతమంది నేతలకు అవమా నం జరిగింది. ఎత్తులు,పైఎత్తులతో ఆధిపత్య పోరుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో మరోసారి పా ర్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గత మయ్యాయి.

కొనసాగిన ఆధిపత్యపోరు
ఆనం సోదరుల ఆధ్వర్యంలో ఆది వారం వీఆర్ కళాశాల మైదానంలో రోశయ్య సభ జరిగింది. ఈ సభలో ఆద్యంతం రాజకీయ హైడ్రామా నడి చింది. కాంగ్రెస్‌లో ప్రధాన వర్గాలుగా ఉన్న ఆనం, ఆదాల వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీయం ద్వారా సభలో తమ హవా కొనసాగించాలని ఆనం సోదరులు ప్రయత్నించి విఫలమ య్యారు.

సీఎం సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్, మేయర్, ఇతర నేతలు హాజరయ్యారు. ఆనం ప్రత్యర్థి వర్గమైన అనిల్‌కుమార్ యాదవ్ విషయంలో ఇరువర్గాలు పట్టుబట్టాయి. అనిల్‌ను వేదికపైకి ఆహ్వానించకూడదని ఆనం వర్గం చేసిన ప్రయత్నాలను ఆదాల వర్గం తిప్పికొట్టింది. ఈ విషయంపై ముందురోజు నుంచే చర్చ జరిగింది.

ఆనం సోదరులు ఇతర నియోజక వర్గాలలో ఓడిపోయిన అభ్యర్థులను సభకు ఆహ్వానించి, అనిల్‌ను ఆహ్వా నించకపోతే సభలో గొడవలు, రచ్చలు జరుగుతాయని ఇంటిలిజెన్సీ వర్గాలు హెచ్చరించాయ. దీంతో సభ ప్రశాం తంగా జరిగేందుకు అటు కలెక్టర్, ఇటు ఎస్పీ ఇరు వర్గాల నేతలతో చర్చలు జరిపారు. అయితే రెండు వర్గాలు పట్టువీడక పోవడంతో సభలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అయింది.

వేదికపైకి అనిల్
సీఎం వేదికపైకి రాకముందే జడ్పీ చైర్మన్ కాకాణి, ఆదాలతో కలిసి అనిల్‌కుమార్‌యాదవ్ వేదికపైకి వచ్చా రు. అప్పటికే ఆనం వర్గీయులైన దేవ కుమార్‌రెడ్డి, హరిబాబుయాదవ్ వేదిక పై కూర్చొని ఉన్నారు. దీంతో పోలీసు లు కలుగచేసుకుని వేదికపైన ఉండా ల్సిన వారు మాత్రమే ఉండాలని, మిగి లిన వారంతా దిగిపోవాలని సూచిం చారు.

దీంతో దేవకుమార్‌రెడ్డి, హరి బాబుయాదవ్ అవమానకర రీతిలో వేదికపై నుంచి దిగిపోయారు. అనం తరం అనిల్‌కుమార్ యాదవ్‌ను వేదిక నుంచి దిగాలని పోలీసు అధికారి సూచించారు. దీనికి కాకాణి, ఆదాల అభ్యంతరం తెలిపారు. కలెక్టర్, ఎస్పీ లకు తాము ముందే చెప్పామని వారి అనుమతులు ఉన్నాయని తెలిపారు.

ఇందుకు పోలీసు అధికారి సమ్మతించక పోవడంతో జేసీ కలుగచేసుకుని అనిల్‌కు అనుమతి ఉందని తెలిపారు. దీంతో ఆ అధికారి వెళ్లిపోయారు. అలాగే అనిల్ వేదికపైన ఉన్నందున తమకు అవకాశం కల్పించాలని కాం గ్రెస్ కార్పొరేటర్లు సందానిబాషా, మునాఫ్, మరికొంతమంది కొద్దిసేపు గొడవ చేశారు. వారిని పోలీసులు పక్కకు నెట్టివేశారు.

కార్పొరేటర్లకు నోచాన్స్
సీఎం సభలో కార్పొరేటర్లకు అవ కాశం కలగలేదు. గతంలో సీఎం సభ లలో కార్పొరేటర్లు వేదికపైకి వెళ్లేవారు. అయితే ఈ దఫా రెండు వర్గాల మధ్య విభేదాలు ఉండడం ఆనం వర్గం కార్పొరేటర్లను సభ పైకి పిలిస్తే తమ వర్గం నుంచి కనీసం ఇద్దర్ని పిలవాలని రాజీవ్‌భవన్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో కార్పొరేటర్లందర్ని వేదికపైకి ఎక్కనివ్వలేదు. సిటీ కాంగ్రెస్ అధ్య క్షుడి హోదాలో చాట్ల నరసింహారావు మాత్రమే వేదికను అలరించారు.

మంత్రి ఇంటికి అసమ్మతి నేతలు
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన నివాసంలో ముఖ్యమంత్రి రోశ య్యకు ఆదివారం మధ్యాహ్నం భోజ నం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్ర మానికి ఆనం ప్రత్యర్థి వర్గం దూరంగా ఉండిపోయింది. ముఖ్యమంత్రితో కలిసి అందరూ వస్తారని భావించి నప్పటికీ, ప్రత్యర్థి వర్గం వ్యూహాత్మ కంగా ఆ కార్యక్రమాన్ని బహిష్కరిం చింది. నేదురుమల్లి జనార్దన్‌రెడి, జడ్పీ చైర్మన్ కాకాణి, ఎమ్మెల్యేలు ఆదాల, మేకపాటి, శేఖర్‌రెడ్డిలతోపాటు ప్రసన్న కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజ రయ్యారు. దీంతో సీఎం భోజన కార్యక్రమానికి కేవలం ఆనం వర్గం మాత్రమే హాజరైంది.

No comments: