Saturday, May 1, 2010
సిఎం పర్యటన పూర్తి స్థాయిలో ఖరారు
ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసారు. ఆదివారం ఉదయం సింహపురి ఎక్స్ప్రెస్లో జిల్లాకు రోశయ్య చేరుకుంటారు. అక్కడి నుండి పినాకినీ అతిథి గృహానికి చేరుకుంటారు. జిల్లా నాయకులతో చర్చించి సంతపేటలోని సిఎం సన్నిహితులు చలమయ్య నివాసంలో అల్పాహార విందుకు హాజరవుతారు. అక్కడ నుండి విఆర్సి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో విందు చేస్తారు. అక్కడ నుండి పినాకినీ అతిథి గృహంకు చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు వేమాలశెట్టిబావిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి నేదురుమల్లి ఇంట్లో విందు చేస్తారు. అక్కడ నుండి పినాకినీ అతిథి గృహంకు చేరుకొని రాత్రికి బస చేస్తారు. సోమవారం ఉదయం టిఫిన్కు పనబాక ఇంటికి చేరుకుంటారు అనంతరం చెన్నైకి బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా 1200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఈ దామోదర్ పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment