నేడు నెల్లూరు

Sunday, May 2, 2010

నేడు నగరానికి సీఎం రాక

రా ష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశ య్య ఆదివారం నెల్లూరుకు రాను న్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఆయనతోపాటు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ఇన్‌చా ర్జిమంత్రి మోపిదేవి వెంకటరమణ, జిల్లామంత్రి ఆనం రామనారాయ ణరెడ్డి పర్యటిస్తారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి సింహ పురి ఎక్స్‌ప్రెస్‌లో బయ లుదేరి ఆ దివారం ఉదయం 7.30 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. అనంత రం పినాకిని అతి థిగృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసు కుంటారు.

అనంతరం పొదలకూ రురోడ్డులోని నేదురుమల్లి జనార్ద న్‌రెడ్డి ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకుంటారు. అక్కడే అధికారు లతో మాట్లాడి వీఆర్ కళాశాలలో జరిగే సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఐదో విడత భూ పంపిణీ, మహిళా సంఘా లకు రుణాలు అందిస్తారు. అక్కడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇంటికి వెళతారు. అక్కడ భోజన కార్యక్రమం ముగించుకుని తిరిగి పినాకిని అతిథిగృహానికి చేరుకుని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు.

సాయంత్రం 4 గంటలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇం టికి, ఆ తరువాత సరయూ అధినేత రాజ్‌కుమార్, మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆర్యవైశ్యప్ర ముఖుడు కేవీ చలమయ్య తదితరుల ఇళ్లకు వెళ్లి కొద్ది సేపు గడుపుతారు.

సాయంత్రం ఆరు గంటలకు వేమాల శెట్టి బావి సత్రం స్థలంలో జరిగే ఆర్యవైశ్యులు, వాణిజ్య వర్గాల సన్మాన సభలో పా ల్గొంటారు. కార్యక్రమానంతరం అతిథిగృహానికి వెళ్లి రాత్రి బస చేస్తా రు. సోమవారం ఉదయం 8 గంటల కు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఇంటికి వెళ్లి అల్పాహారం స్వీకరిం చనున్నారు. అనంతరం చెన్నయ్ వెళ్లి అక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరతా రు.

No comments: