నేడు నెల్లూరు

Monday, May 3, 2010

కరుణించని ము ఖ్యమంత్రి రోశయ్య

జిల్లాలో తొలిసారిగా ము ఖ్యమంత్రి హోదాలో ఆదివారం పర్యటించిన కొణిజేటి రోశయ్య జిల్లా ప్రజలకు నిరాశనే మిగిల్చారు. ప్రధాన సమస్యలు ప్రస్తావనే లేకపోగా, ఎలాంటి వరాలజల్లులు కురిపించలేదు. అధికారిక కార్యక్రమం ఒకటే అయినప్ప టికీ, పలు ప్రైవేటు కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపారు. పార్టీలోని విభేదాలపై నోరుమెదపని ఆయన, నేతలందరి ఇళ్లకు పరుగులు పెట్టి అందరివాడననిపించుకున్నారు. సీఎం పర్యటన ఆద్యంతం పోలీసులు అత్యుత్సాహం చూ పారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

హామీలివ్వని సీఎం
ఆదివారం ఉదయం సింహపురి రైలులో నెల్లూరుకు చేరుకున్న సీఎం రోశయ్యకు అధికారులు, అనధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన పినాకిని అతి«థిగృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. మంత్రులతో నేదురుమల్లి ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం 11 గంటలకు వీ ఆర్ కళాశాల మైదానంలో జరిగిన భూపంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. త దుపరి మంత్రి ఆనం రామనారా యణరెడ్డి ఇంట్లో భోజనం చేసి తిరిగి అతిథిగృహానికి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు విశ్రాంతి తీసుకున్నారు.

నేతల ఇళ్లకు పరుగులు
సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పత్తి రవీంద్రబాబు, ఇండీవర్ మోటార్స్ అధినేత రాజ్‌కుమార్, కేవీ చలమ య్య తదితరుల ఇళ్లలో జరిగిన తేనేటి విందుకు హాజరయ్యారు. రాత్రి 8 గంటలకు ఆర్యవైశ్య సంఘం సన్మాన సభకు రోశయ్య హాజర య్యారు.

ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జిల్లాకు వరాలేవి ప్రకటించలేదు. భూ పంపిణీ కార్య క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఎన్నో సమస్యలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అయినా వీటిపై స్పందించకపోగా, పాత పథకాల అమలునే పదే పదే ప్రస్తావించారు. నెల్లూరు అవసరాలన్నీ తెలుసంటూ ప్రజాప్రతినిధులు కోరిక మేరకు సమస్యలు తీరుస్తానని ఇచ్చారు.

కృష్ణపట్నం, ఎస్ఈజెడ్‌లు, ఆపాచీల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పి స్తామని ప్రకటించినా ఇవి జిల్లాలో అమలవుతున్న పథకాలే. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇతరత్రా పథ కాలపై ఎలాంటి హామీలు ఇవ్వలేదు. భూ పంపిణీ సందర్భంగా సీఎం ప్రసంగం ప్రజలను ఆకట్టుకోలేకపో యింది. సాయంత్రం జరిగిన సన్మాన సభలో కాస్త భిన్నరీతిలో మాట్లాడి ఆర్యవైశ్యులను ఆకట్టుకోగలిగారు.

సీఎం అయినంత మాత్రాన సంఘ సమస్యలు తీర్చలేనని, కాంగ్రెస్ పార్టీ మీ సమస్యలను తీరుస్తుందంటూ తేల్చి చెప్పారు. ఎక్కడా కూడా హా మీలు ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ప్రజాపథం, ఎమ్మెల్యేల పనితీరు, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష జరుపుతారని గతంలో మంత్రి ఆనం ప్రకటించారు. కాని ఈ ఊసే లేకుండాపోయింది.

విభేదాలపై మౌనం
జిల్లా కాంగ్రెస్ నాయకులు గ్రూపులతో సతమతమవుతున్నారు. ఈ వర్గపోరును నియంత్రించాల్సిన సీఎం వారి ఇళ్లకు వెళ్లి తేనేటి సేవిం చడం మరింత వివాదానికి ఆజ్యం పోసింది. నేదురుమల్లి ఇంటికి వెళ్లిన సీఎంతోపాటు మంత్రి ఆనం ఒక్కరే హాజరు కాగా, మధ్యాహ్నం ఆనం ఇంట జరిగిన విందుకు ఆనం వ్యతిరేక వర్గీయులు ఒక్కరూ కూడా హాజరు కాలేదు.

అదేవిధంగా ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇంటికి రోశయ్య వెళ్లగా, ఆనం వర్గీయులు వెళ్లలేదు. ఇలా ఒకరి ఇళ్లకు వెళ్లిన సీఎం మరో ఇంటికి వెళ్లేలోగా నా యకులు దూరందూరంగానే ఉం టూ వచ్చారు. నేదురుమల్లితో మాత్రం సీఎం వర్గపోరుపై ప్రస్తావిం చినట్లు సమాచారం. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేదురుమల్లిని కోరినట్లు తెలిసింది. భూ పంపిణీ సభా వేదికపై కొందరు నేతలను దింపే ప్రయత్నం జరిగిం ది.

చివరకు పోలీసుల ద్వారా వారిని కిందకు దింపి కక్ష సాధించుకున్నట్లు ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సోమవారం ఉదయం రోశయ్య కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకుని, తదుపరి విశాఖకు వెళ్లనన్నారు. నాయకులం దరి ఇళ్లకు వెళ్లిన సీఎం వారిని ఒక తాటిపై తీసుకురావడంలో విఫలమ య్యారనే విమర్శలు పార్టీలో విని పిస్తున్నాయి.

ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటన్నది అర్థంకావడంలేదని పరిశీలకులు అంటున్నారు. భద్రత పేరుతో పో లీసులు ముఖ్యనేతలనే సీఎం వద్దకు పంపారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులు సీఎంకు తమగోడును వినిపించే వీలులేకుండా పోయింది. పోలీసుల అత్యుత్సాహం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. బందో బస్తు పేరుతో మీడియోను కూడా పోలీసులు ఇబ్బందులు పెట్టారు. ఏది ఏమైనా రోశయ్య జిల్లా పర్యటన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నిరాశను మిగిల్చింది.

No comments: