ర్రాష్ట ముఖ్యమంత్రి రోశయ్య జిల్లా పర్యటన సందర్భంగా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో శని, ఆదివారాలు విద్యుత్ కో తను ఎత్తి వేస్తూ ట్రాన్స్కో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వేసవి ప్రారం భం అయిన నాటి నుంచి వేళాపాళా లేకుండా విద్యుత్ కోత విధించి ప్రజల ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ట్రా న్స్కో శాఖ ముఖ్యమంత్రి జిల్లాకు వస్తుండడంతో అటు ప్రజలు ఇటు ప్రతి పక్షాలు విద్యుత్ కోత పై రగడ చేస్తారన్న ఉద్దేశంతో తాత్కాలికంగా కోతక స్వస్తి పలికింది.
ప్రజలను మభ్యపెట్టేం దుకు మున్సిపాలిటీల వరకు విద్యుత్ కోతను ఎత్తి వేశారు. ఈ విషయమై ఆన్లైన్ వెంకటగిరి ట్రాన్స్కో అధికారులను ప్రశ్నించగా విద్యుత్ కోతను రెండు రోజుల పాటు మున్సిపాలిటీలో ఎత్తి వేయవలసిందిగా జిల్లా అధికారు లు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. విద్యుత్ కోత ఎత్తివేతపై ట్రాన్కో జిల్లా ఎస్ఈని వివరణ కోరగా డిస్ప్యాచ్ సెంటర్ ఆదేశాలు మేరకు ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో రెండు రోజుల పాటు విద్యు త్ కోతను ఎత్తి వేయడం జరిగిందన్నా రు. సోమవారం నుండి విద్యుత్ కోతను యథావిధిగా కొనసాగించడం జరుగుతుందన్నారు.
Monday, May 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment