నేడు నెల్లూరు

Tuesday, May 4, 2010

జనార్ధన్‌రెడ్డిపై సోనియాకు ఫిర్యాదు చేస్తా : పద్మనాభరెడ్డి

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానని నేదురుమల్లి విద్యా సంస్థల చైర్మన్ నేదురుమల్లి పద్మనాభరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక దర్గామిట్టలోని పనబాక లక్ష్మి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు కోల్పోవటానికి కారణం జనార్ధన్‌రెడ్డి అన్నారు. గూడూరులో కాంగ్రెస్ టిక్కెట్టు పనబాక కృష్ణయ్యకు ఇచ్చారని, అందుకని తెలుగుదేశం పార్టీ వైపు ప్రచారం నిర్వహించి, టిడిపిని గెలిపించారన్నారు. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని పనిచేశానని అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అల్పాహార విందుకు విచ్చేసిన రోశయ్యకు ఫిర్యాదు చేశానని తెలిపారు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మధ్య సంబంధాలు ఉన్నాయన్నారు. విద్యా సంస్థలు నిర్వీర్యమై పోతున్నాయని, అందుకని స్వాధీనం చేసుకున్నానని చెప్పడం దారణమన్నారు. తాము రోజురోజుకు విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తాను పనబాక కృష్ణయ్యకు సహకారం అందించానని, అందువల్ల జనార్ధన్‌రెడ్డి విద్యా సంస్థలను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారన్నారు.

No comments: