నేడు నెల్లూరు

Tuesday, July 26, 2011

సీఎం సమక్షంలో మాట్లాడనివ్వలేదు

జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్ర సాద్ ఆరోపించారు.
టీడీపీ జిల్లా కా ర్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు.
దళితుల సమస్యలపై ప్రజా ప్రతినిధిగా తనను మాట్లాడనీయకపోవటం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల పనితీరు, ఆయా వర్గాల సంక్షేమంపై చర్చే లేకుండా మొక్కుబడిగా సమావేశం ముగించారని విమర్శించారు.

ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు నియోజకవర్గంలో అం తా తామై వ్యవహరిస్తున్నారన్నారు. నిధుల విడుదలపై మంత్రి ఆనం రా మనారాయణరెడ్డి గూడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పనబాక కృష్ణయ్యకు అధికారిక నివేదికను పంపటం ఏమిటంటూ ప్రశ్నించారు. స్వర్ణముఖి నది చెక్‌డ్యాం నిర్మాణ అం చనా వ్యయాన్ని భారీగా పెంచడం వె నుక కారణమేమిటన్నారు. తెలుగుగంగ కాలువలో పూడిక తీతకు ప్రభుత్వం హామీ ఇచ్చి రెండేళ్లయినా పనులు ప్రారంభం కాలేదన్నారు.

చల్ల కాలువ ప్యాకేజి నిర్మాణానికి 2009లోనే అగ్రిమెంట్లు జరిగినా నేటికీ పనులు ప్రారంభించలేదన్నా జల యజ్ఞం ధన యజ్ఞంగా మారిందని విమర్శించారు

No comments: