ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఈ నెల 24న జిల్లాకు వస్తున్నట్లు రూరల్ శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి తెలిపారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్లో సిఎం జిల్లాకు వస్తున్నట్లు ప్రకటించినప్పటికి శాసనమండలి ఎన్నికల కోడ్ అమలు కావడంతో ఆయన పర్యటన రద్దయిందన్నారు.
కరెంట్ ఆఫీసు సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించాల్సి ఉండడంతో సీఎం పర్యటన రద్దు కావడంతో పనులు ఆగిపోయాయి. మళ్లీ ఎట్టకేలకు ఈ నెల 24న జిల్లాకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. 24న ఉదయం తొమ్మిది గంటలకు జగజ్జీవన్రాం, వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు వీఆర్ హైస్కూలు మైదానంలో జరిగే రైతు సదస్సులో పాల్గొంటారు.
మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లాలో జరిగే అభివృద్ధి పనులపై అధికారులు సమీక్ష, సాయంత్రం ఐదు గంటలకు సీపీఆర్ కల్యాణ మండపంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి నెల్లూరులో బస చేసి 25న ఉదయం హైదరాబాద్కు వెళుతారు. సీఎంతో మంత్రి, ఎమ్మెల్యేలు సమావేశం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం హామీ పొందేందుకు మంత్రి ఆనం, ఎమ్మెల్యేలు ఈ నెల 15న సీఎంతో సమావేశం అవుతారు.
సీఎం పర్యటనకు వస్తుండడంతో కలెక్టర్ శ్రీధర్ బుధవారం జిల్లా అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నగర పాలక సంస్థ కమిషనర్, ఇతర అధికారులతో చర్చించారు.
Thursday, July 14, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment