నేడు నెల్లూరు

Saturday, July 23, 2011

సీఎం పర్యటించే ప్రాంతాల్లో రాకపోకలు నిషేధం

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో నెల్లూరు జిల్లా పర్యటన దృష్ట్యా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం రోజు సీఎం పర్యటించే సమయంలో ఆ ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. సీఎం పర్యటించే సమయంలో వాహనాల రాకపోకలను నిషేధించే ప్రాంతాల వివరాలిలా ఉన్నాయి.

ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు వేదాయపాళెం నుంచి అంబేద్కర్ భవన్ వరకు, 11 నుంచి 12 గంటల వరకు వీఆర్‌సీ సెంటరు నుంచి వేదాయపాళెం వరకు, 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పొగతోట వెంకటరమణ హోటల్ నుంచి వీఆర్‌సీ వరకు రాకపోకలు నిషేధిస్తున్నట్లు పోలీ సులు తెలిపారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు వీఆర్‌సీ నుంచి కేవీఆర్ పెట్రోలు బంకు వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పొదలకూరు రోడ్డు, ఎస్పీ బంగ్లా, బట్వాడిపాళెం వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు బట్వాడిపాళెం నుంచి పద్మావతి పొదలకూరు రోడ్డు ప్రాంతంలోని డైకస్‌రోడ్డు వరకు, సాయత్రం 6 నుంచి 7 గంటల వరకు బట్వాడిపాళెం ప్రాంతం నుంచి ఎస్పీ బంగ్లా వరకు రాకపోకలు నిషేధిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.

No comments: