నెల్లూరు సిటీ, జూలై 22 : జిల్లా పరిషత్ పాలక వర్గం గడువు శుక్రవారం ముగిసింది. చైర్మన్ కాకాణి గోవర్దనరెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. చివరి రోజున జడ్పీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఉద్యోగ సిబ్బంది వీడ్కోలు పలికారు.
ప్రతి ఒక్కరికీ అభివాదం సాయంత్రం నాలుగు గంటలకు చైర్మన్ హోదాలో వచ్చిన కాకాణి ఆరు గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్గా బయటకు వెళ్లారు. 5 గంటలకు పదవీ కాలం ముగియడంతో ఆయన తన చాంబర్ నుంచి బయటకు వచ్చి కార్యాలయంలోని అన్ని విభాగాలకు వెళ్లారు. 'ఇక సెలవు' అంటూ అందరి నుంచి వీడ్కోలు తీసుకున్నారు.
ప్రజల అండతో ఐదేళ్లు : కాకాణి ప్రజల అండదండలు, జడ్పీ పాలకవర్గ సభ్యుల సహకారంతో ఐదేళ్ల పాలనను దిగ్విజయంగా కొనసాగించారని కాకాణి గోవర్దనరెడ్డి తెలిపారు. జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లా పరిషత్ కార్యాలయ భవనం నుంచి అభివృద్ధిని అడ్డుకోవాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నించాయని అయితే ప్రజలు అండతో వారి కుయక్తులను తిప్పి కొట్టామని చెప్పారు. దివంగత నేత వైఎస్ఆర్ వల్ల లబ్ధి పొందిన కొంతమంది నేతలు ఆయన మరణం తరువాత ఆరోపణలు చేస్తూ ఆయన పేరును ప్రజల్లో లేకుండా చేయాలని చూశారన్నారు. వైఎస్ కుటుంబానికి తాను అండగా నిలవడంతో తనను పదవి నుంచి తప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ బాధ్యతలు చేపట్టిన రోజునే చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని భావించానన్నారు. అయితే తమ సహకారం లేకుండా ఐదేళ్ల పాలన ఎలా సాగిస్తారో చూస్తామంటూ కొంత మంది అధికార పార్టీ నాయకులు పేర్కొనడంతో ఐదేళ్లు చివరి నిమిషం వరకు చైర్మన్గా కొనసాగి తానెంటో ప్రత్యర్థులకు రుజువు చేశానన్నారు. ఇసుక అక్రమాలపై న్యాయ పోరాటం చేసి రూ. 60 కోట్ల నిధులు రాబట్టానని చెప్పారు.
దీంతో తనపై క్రి మినల్ కేసులు పెట్టాలని కొంత మంది న్యాయ స్థానాన్ని ఆశ్రయించారన్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యం కల్పించానని వివరించారు. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయిందని కాకాణి పేర్కొన్నారు. వైఎస్ మరణంతో సగం చచ్చిపోయిన పార్టీని అధికారంలో ఉన్న నేతలు పూర్తిగా చంపేశారన్నారు
Saturday, July 23, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment