నగరంలో ఆదివారం అర్థరాత్రి అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి రెండో కుమారుడిపై దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేక్షకుల కథనం మేరకు.. అధికార ప్రజాప్రతినిధి కుమారుడు నగరంలోని ఒక సినిమాహాలుకు ఆదివారం రెండో ఆటకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా ఆయన కూర్చున్న సీటుకు ముందు కొందరు మహిళలు కూర్చుని ఉన్నారు.
ఆయన పక్కన ఉన్న కొందరు, ఆ మహిళలను అసభ్యపద జాలంతో మాట్లాడుతుండగా అతను ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఆరుగురు యువకులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారని తెలిసింది. తాము దాడి చేసింది ఓ ప్రజాప్రతినిధి కుమారుడిపై అన్న విషయం తెలుసుకున్న ఆ యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దాడి చేసిన ఆరుగురు యువకులు కుమ్మరవీధికి చెందిన వారుగా గుర్తించారు. ఈ సంఘటపై పోలీసులకు ఎటుంటి ఫిర్యాదు అందలేదు.
Tuesday, July 26, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment