దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. స్థానిక కరెంటు ఆఫీస్ సెంటర్లోని వైస్సార్ విగ్రహాన్ని సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారని, అయితే అదే ప్రభుత్వం ఆయన మరణానంతరం వారి కుటుం బాన్ని వెన్నుపోటు పొడుస్తుందన్నారు. 24వతేదీనాటి సీఎం పర్యటనలో ఒక్క ఫ్లెక్సీలో కూడా వైఎస్సార్ ఫొటో ఏర్పా టు చేయకపోవడం దారుణమన్నా రు.
పజల గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరి ఉన్నారని, మీరెన్ని కుటల యత్నా లు చేసినా ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయలేర న్నారు. ఆనం సోదరులు వైఎస్సార్ నుంచి పదవులు పొంది, నాటకాలు ఆడుతూ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆ మహానేత కూడా భరించలేకపోయారన్నారు. అందుకు నిదర్శనమే తెరకూడా సహకరించకపోవడమన్నారు.
Tuesday, July 26, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment