నేడు నెల్లూరు

Thursday, July 14, 2011

సంక్షోభంలో ఆక్వా సాగు

అల్లూరు సిరులు కురిపిస్తుందనుకున్న వెనామీ రొయ్యలసాగువల్ల ఎంతో మంది రైతులు ఈ ఏడాది నష్టాన్ని చవిచూశారు. రెండు సంవత్సరాలపాటు వెనామీవల్ల ఎంతోమంది ఎకరాకు రూ.7 లక్షల నుంచి రూ.12లక్షల మేర ఆదాయాన్ని పొందారు. గత రెండేళ్ల వరకు అమెరికా, థాయిలాండ్ దేశాల నుంచి ఎటువంటి కల్తీలేని సీడ్ దిగుమతి అయ్యేది.
రెండు సంవత్సరాలపాటు అధికంగా ఆదాయం రావడంతో ఎంతోమంది చిన్న,సన్నకారు రైతులతోపాటు పెద్ద కంపెనీలు సైతం వందల ఎకరాలు సాగుచేసేందుకు సమాయత్తమయ్యారు. తీరప్రాంత భూములకు పెద్ద గిరాకీ ఏర్పడింది.

ఒక ఎకరాకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు లీజు ఇచ్చి పొలాన్ని రొయ్యల చెరువుగా మార్చారు. కానీ ఆ ఉత్సాహం ఎంతోకాలం నిలువలేదు.
ప్రస్తుత ఫిబ్రవరిలో వెనామీ రొయ్యలసాగుపట్ల ప్రచారం ముమ్మరంగా సాగింది. కేవలం 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే రొయ్యలచెరువులన్నీ పలురకాల కారణాలతో దెబ్బతిన్నాయి.

సొంత పొలాలవారికి అసల జమకాగా లీజువాళ్లకి ఎకరాకు రూ.లక్ష మేర నష్టం వాటిల్లింది. గత సంవత్సరం 50 కౌంట్ కేజీ ధర రూ.280లు కా గా, ప్రస్తుతం రూ.140లుగా ఉంది. 30 కౌంట్‌ధర రూ.460లు ఉండగా ప్రస్తు తం రూ.230లకే పరిమితం అ య్యింది. గత ఏ డాదితో పోలిస్తే ఖర్చులు విపరీతంగా పెరిగిపోగా రొయ్యలు రేటు మాత్రం సగానికి తగ్గిపోయింది.
5 ఎకరాలు లీజుకు సాగుచేసిన వారికి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఏరియేటర్లు, వర్కర్లు ఉండేందుకు షెడ్లులాంటివి ఖర్చులే సుమారు రూ.5 లక్షలకు పైగా అయ్యాయి. ప్రస్తుతం లీజుకు తీసుకున్నవారు వచ్చిన నష్టాన్నిచూసి తలను పట్టుకుంటున్నారు.
v - సీడ్‌లోనే ప్రధానలోపం: లక్షల రూపాయలు ఖర్చుచేసి రొయ్యలసాగును చేపట్టిన రైతాంగానికి సీడ్ కంపెనీలు నెత్తిన కుచ్చుటోపీ పెట్టాయి. 30 పైసలు ఉన్న రొయ్యపిల్ల ధరను రెండింతలు అధికంగా 90 పైసలు చొప్పున అమ్మి సొమ్ముచేసుకున్నారు. పైగా కొన్ని కంపెనీలదగ్గరే కొనాలంటూ ప్రతిరోజూ పేపర్లలో ప్రకటనలు ఇవ్వడంతో నమ్మి కొనుగోలుచేసిన రైతులు అవి పుచ్చిబురగలవడంతో మోసపోయామని తలలు పట్టుకున్నారు.

కంపెనీవారు స్థానికంగా దొరికే సీడ్‌ను కొనుగోలుచేసి ఇంపోర్టెడ్‌గా ప్రకటనలు ఇచ్చి రూ.కోట్లు సొమ్ముచేసుకున్నారు. మత్స్యశాఖ ఎటువంటి నియంత్రణలు లేకుండా కంపెనీలవారివద్ద నుంచి లంచం తీసుకొని పర్మిషన్లు ఇస్తుండటంవల్లే అమాయకపురైతులు మోసపోతున్నారు.

No comments: