Saturday, July 30, 2011
ఉగ్రవాదుల్లా మాట్లాడకండి-సోమిరెడ్డి
తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు , ఇతర సంఘాలు జరిపే సకల జనుల సమ్మెలో పాల్గొనకపోతే రాళ్లతో దాడులు చేస్తామని సీమాంధ్ర ఉద్యోగులను హెచ్చరించడం వివాదాస్పదం అవుతోంది.ఈ తరహా ప్రకటనలు తెలంగాణ లక్ష్యాన్ని దెబ్బతీస్తాయని కొందరు విమర్శిస్తుంటే, ఇలాంటి ప్రకటనలు చేయడం తప్పని మరికొందరు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ టిడిపి ఎమ్.పి రమేష్ రాధోడ్ మాట్లాడుతూ దాడులు చేయాలనడం సరికాదని వ్యాఖ్యానించారు.కాగా దీనిపై తెలుగుదేశం కోస్తా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొంతమంది ఉగ్రవాదులు మాదిరి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగాఉండడం కోసం ఎన్ని అవమానాలు అయినా భరిస్తామని వ్యాఖ్యానించారు. హైదరాబాదులో సీమాంధ్రుల పెట్టుబడులు భారీగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు.కాగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలా? వద్దా అనేది తెలంగాణ టిడిపి ఫోరం మీటింగులో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.ఏది ఏమైనా సీమాంధ్ర ఉద్యోగులు విధులకు హాజరైతే దాడులు చేస్తామని, ప్రజాప్రతినిదులు రాజీనామాలు చేయకపోతే రాళ్లతో దాడి చేస్తామని అనడం సమంజసం కాదు. కాకపోతే ఇలాంటివాటిని తెలంగాణ లోని కాంగ్రెస్ నేతలు, టిఆర్ఎస్ నేతలు ఖండించకపోవడం కూడా గమనించదగ్గ విషయమే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment