నేడు నెల్లూరు

Wednesday, March 31, 2010

సినీ పరిశ్రమతో ఆడుకుంటున్న ఐపిఎల్‌ - సినీ నటుడు శివాజి

ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా పడుతుందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ యావత్తు మూతపడే ప్రమాదమున్నట్లు సినీ హీరో, తాజ్‌మహల్‌ సినిమాతో నిర్మాతగా మారిన శివాజి పేర్కొన్నారు. తాజ్‌మహల్‌ విజయయాత్ర సందర్భంగా చిత్ర యూనిట్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం నెల్లూరు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రముఖ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సినీ పరిశ్రమపై లక్షలాదిమంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవితాలతో ఐపిఎల్‌ నిర్వాహకులు ఆటలాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొద్దిరోజులు మాత్రమే నిర్వహిస్తుండే ఈ ఐపిఎల్‌ మ్యాచ్‌లు ప్రస్తుతం 40 రోజుల వరకు కొనసాగుతుందని, దీనిని అడ్డుకునేందుకు సినీ ప్రముఖులు, నిర్మాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రభావం ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై కూడా పడుతుందన్నారు. ఐపిఎల్‌ నిర్వాహకులు లలిత్‌మోడీ అంతా తానై ఈ మ్యాచ్‌లను నిర్వ హించడాన్ని ఆయన ఖండించారు.

No comments: