నేడు నెల్లూరు

Tuesday, March 30, 2010

ఐపిఎల్ క్రెకెట్ మ్యాచ్‌లపై నెల్లూరులో రోడ్‌షోకు విశేష స్పందన

మహిళల్లో క్రికెట్‌పట్ల ప్రత్యేకించి ఐపిఎల్ మ్యాచ్‌లపట్ల అవగాహన పెంచేందుకు ఈమ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సోనీమాక్స్ చానెల్ చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి నగరంలో మంచి స్పందన లభించింది. రాష్ట్రానికి చెందిన డక్కన్‌చార్టర్స్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రశ్నలతో కూడిన కూపన్లను సోనీమాక్స్ చానెల్ ప్రతినిధులు సోమవారం మహిళలకు పంపిణీ చేశారు. ఈప్రశ్నలకు సరైన సమాధానం రాసి పంపిన వారిలో విజేతలను ఎంపికచేసి వారి ఇళ్లకు ప్రముఖ టివి యాంకర్లు ఉదయభాను, ఝాన్సీ అతిధులుగా విచ్చేసి బహుమతులు అందచేయనున్నారు. నగరంలో ఉదయం నుండి సాయంత్రం వరకు జేమ్స్ గార్జెన్, బాలాజీనగర్, ట్రంకురోడ్డు, బృందావనం, వెంకటరామాపురం, స్టోన్‌హౌస్‌పేట, సంతపేట, మూలపేట, పప్పులవీధి, ఉస్మాన్‌సాహెబ్‌పేట, చిన్నబజారు, పెద్దబజారు, రాయాజీవీథి తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుంటూరు నుండి ప్రారంభమైన ప్రచార రథం తెనాలి, పొన్నూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు, శింగరాయకొండ, కావలి మీదుగా నెల్లూరు చేరుకుంది. నెల్లూరు నుండి గూడూరు, నాయుడుపేట మీదుగా తిరుపతికి చేరుతుంది. ఈ కార్యక్రమంలో సోనీమాక్స్ ప్రతినిధి కె శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రథంతో బయల్దేరిన మరో రథం గుడివాడ, ఏలూరు, తణుకు, రాజమండ్రి, కాకినాడ, తుని, అనకాపల్లి, గాజువాక మీదుగా ఏప్రిల్ 1వ తేదీనాటికి విశాఖపట్నం చేరుకుంటుందని శివప్రసాద్ తెలిపారు.

No comments: