Monday, March 29, 2010
నెల్లూరు నగర మేయర్ భానుశ్రీ కనిపించడం లేదు
నెల్లూరు నగర మేయర్ నందిమండలం భానుశ్రీ గత 20 రోజులుగా కనిపించడం లేదని స్థానిక తెలుగుదేశం నేతలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగంపై మేయర్ భర్తను ఎసిబి అధికారులు అరెస్టు చేసినప్పటి నుండి ఆమె కనీసం కార్పొరేషన్ అధికాలకైనా చెప్పకుండా అదృశ్యమయ్యారని నెల్లూరు నాలుగవ నగర పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్పొరేషన్ కమిషనర్తో సహా అధికారులంతా ఆమె ఆచూకీ తమకు తెలియదని చెబుతున్నారని ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిలారి వెంకట స్వామి నాయుడు చెప్పారు. ఎసిబి కేసు నుండి తన భర్తను కాపాడుకోవడానికి ఆమె ప్రయత్నం చేసుకోవడంలో తప్పులేదని అయితే కనీసం పాలనా బాధ్యతలను డిప్యూటీ మేయర్కు అప్పగించి వెళ్లకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారన్నారు. మేయర్ కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయారన్నారు. దీనితో పలాయనవాదం పాటించినట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకుని దిక్కులేకుండా పోయిన కార్పొరేషన్ను ఆదుకోవాలని కోరారు
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
good work
Thank you to vist this page
Post a Comment