నేడు నెల్లూరు

Friday, March 26, 2010

మేయర్ భానుశ్రీ భర్తకు బెయిలు మంజూరు

నెల్లూరు, మార్చి 25: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఎసిబి అధికారులు నమోదు చేసిన కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న కార్పొరేషన్ మేయర్ నందిమండలం భానుశ్రీ భర్త ట్రాన్స్‌కో డిఇ శివ సుబ్బరాజుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరయింది. దీనితో గురువారం ఆయన హైదరాబాద్ చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఎసిబి అధికారులు రెండు వారాల క్రితం ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటి నుండి ఆయన బెయిల్ కోసం ప్రయత్నం జరుగుతోంది. తన భర్తకు బెయిల్ సాధించడం కోసం మేయర్ హైదరాబాద్‌లో మకాం వేశారు. మేయర్ భర్త కావడంతో సుబ్బరాజు బెయిల్ కోసం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి గట్టి ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించింది. తన భర్త సుబ్బరాజుకు బెయిల్ కోసం మేయర్ భానుశ్రీ హైదరాబాద్‌లో మకాం వేయడంతో కార్పొరేషన్‌లో ఆమె ప్రమేయంతో జరగాల్సిన పనులు స్తంభించిపోయాయి.

No comments: