Wednesday, June 8, 2011
100 కోట్లతో జీవీకే మనవరాలి పెళ్లి
ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త వ్యాపారవేత్త అయిన గుణుపాటి వెంకటకృష్ణారెడ్డి ( జీవీకే రెడ్డి ) మనువరాలు మల్లిక వివాహం.. బ్రహ్మండమైన రీతిలో చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో న్యూజీలాండ్కు చెందిన ఒక ప్రవాసాంధ్రుడు హైదరాబాద్లో 40 కోట్లు ఖర్చుపెట్టి చేస్తే.. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వివాహం కూడా పెద్ద పెద్ద సెట్టింగుల మధ్య రమణీయంగా జరిగింది. అంతకుముందు వైభవంగా సాగింది. వాటన్నింటినీ తలదన్నే రీతిలో జీవీకే రెడ్డి మనవరాలి పెళ్లి.. సినీరంగ ప్రముఖుడు.. శ్యాంప్రసాద్రెడ్డి కుమారుడు సిద్ధార్తరెడ్డితో జరగబోతోంది. విశేషమేంటంటే.. పెళ్లి కూతురు మల్లిక తల్లి.. రాజ్యసభ సభ్యులు మరో పారిశ్రామిక వేత్త సుబ్బిరామిరెడ్డి కుమార్తె కావడం. వీరి ఎంగేజ్మెంట్ సెర్మనీయే అప్పట్లో పెద్దవార్తగా చెప్పుకున్నారు. వీరి వివాహానికి ముంబై ఢిల్లీ వంటి నగరాల నుంచి ప్రత్యేక విమానాలను నడపబోతున్నారు. ఈ వివాహానికి వస్తున్న ప్రముఖుల పేర్ల జాబితాలో.. ముఖేష్ అంబానీ, సల్మాన్ఖాన్, అభిషేక్ ఐశ్వర్యారాయ్బచ్చన్, పలువురు కేంద్రమంత్రులు.. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది ప్రముఖులు రాబోతున్నారు. కరన్జొహార్, షారూఖ్ఖాన్ అలాగే హాలీవుడ్నటి జెన్నిఫర్ లోపేజ్ కూడా రావొచ్చని చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం మల్లికను పెళ్లికూతరుని చేసిన కార్యక్రమం సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత సినీనటి హేమమాలిని భరతనాట్య ప్రదర్శన చేయటం హైలెట్గా నిలిచింది. జూన్ 12 వ తేదీన జరగబోయే ఈ కళ్యాణ వేడుక గతంలో జరిగిన వివాహాలను మించిపోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 40 నుంచి 50 కోట్ల ఖర్చుతో జరిగిన పెళ్లే రికార్డ్గా భావిస్తుంటే.. బహుశా జీవీకే వారింట పెళ్లి వంద కోట్లకు చేరుతుందేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment