నేడు నెల్లూరు

Wednesday, June 8, 2011

చిరంజీవికి షిప్పింగ్ శాఖ?

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కాంగ్రెస్ పై పెద్ద ఆశలనే పెట్టుకున్నారని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయనకు కేంద్రంలో పెద్ద పదవి వస్తుందని అంతా అనుకుంటున్నారు అయితే స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర మంత్రి పదవి అని చెబుతున్నారు. దీనికి సంబంధించి చిరంజీవి ప్రాధాన్యతలను అడిగితే రైల్వేశాఖ లేదా గ్రామీణాభివృద్ది శాఖలను ఇస్తే బాగుంటుందని సూచించారని చెబుతున్నారు. దానికి కాంగ్రెస్ నాయకులు కాస్త ఆశ్చర్యపోయారట. అప్పుడే అంత పెద్ద శాఖ కోరుతున్నారా అని అనుకున్నారట. ఆ తర్వాత షిప్పింగ్ శాఖ ఇచ్చే అవకాశం ఉందని వారు చెప్పారని అంటున్నారు. చిరంజీవి సన్నిహితుడైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు షిప్పింగ్ రంగంలో అనుభవం ఉంది. ఆ పరిశ్రమను ఆయన నడుపుతున్నారు. కనుక ఆ శాఖ వచ్చినా బాగానే ఉంటుందని వారు అనుకుంటున్నారట. కాగా ప్రజారాజ్యం విలీనం ప్రక్రియ పూర్తి అయ్యేవరకు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగకపోవచ్చని చెబుతున్నారు.విలీనం సభను విశాఖపట్నంలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఏమి జరిగినా ఆ సభ తర్వాతే అంటున్నారు. కాగా ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్రంలో రెండు మంత్రి పదవులే ఇవ్వగలుగుతామని అధిష్టానం పెద్దలు చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది.

No comments: