Thursday, June 9, 2011
బొత్సా శిబిరంలోకి ఆనం
కాంగ్రెస్లో సమీకరణాలు మళ్లీ మారుతున్నాయి. మొదట కిరణ్కుమార్రెడ్డికి సమీపంగా ఉండి ఆ తర్వాత ఆయనకు కాస్త దూరమైన నేతలు.. పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు.. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి.. ముఖ్యమంత్రి కిరణ్కు సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత కాలంలో ఏమైందో కానీ.. కిరణ్ ఈయన్ను కాస్త దూరంగా పెట్టడం ఆరంభించారు. ప్రణాళికా సంఘం మీటింగ్కు కానీ ఆ తర్వాత బ్యాంకర్ల సమావేశానికి కానీ.. ఆనం లేకుండానే సీఎం నడపడం అసంతృప్తికి దారి తీసింది. సీఎం కావాలనే తనను దూరంగా ఉంచుతున్నాడని ఆనం భావించే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలోనే మంత్రి బొత్స పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆనం వెంటనే బొత్సా శిబిరంలో ముఖ్యుడిగా మారిపోయారు. 11 తేదీన గాంధీభవన్లో భారీ ఎత్తున జరిగే పీసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకారోత్సవానికి.. ఏర్పాట్లు చేసే బాధ్యతను ఆనం రాంనారాయణ రెడ్డి తన నెత్తిమీద వేసుకున్నారు. మంత్రి దానం నాగేందర్ ముఖేష్లు ఉన్నప్పటికీ.. ప్రత్యేకించి జన సమీకరణ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించి సమన్వయపరచే డ్యూటీని కూడా ఆనంకు బొత్సా అప్పజెప్పారని తద్వారా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారని భావిస్తున్నారు. బొత్సా గాంధీభవన్ ప్రవేశం ఘనంగా జరిగితే ఆ క్రెడిట్ ఆనంకు కూడా వస్తుందన్న మాట. తద్వారా బొత్సా దగ్గర ఆనం మాటకు విలువ పెరుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment