Wednesday, June 8, 2011
వెంకయ్య నాయుడు గారి సుద్దులు
నల్లధనాన్ని వెలికి తీస్తే దేశంలో పేదవాడు ఉండడని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్.వెంకయ్య నాయుడు అన్నారు.రాందేవ్ బాబా దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా బిజెపి చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.రాందేవ్ దీక్షను భగ్నం చేయడం, అది కూడా అర్ధరాత్రి చేయడం, మహిళలను, పిల్లలను విచక్షణారహితంగా కొట్టడం దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పని చేయడం లేదన్నారు.నల్లధనం కుబేరుల గురించి వెల్లడించడానికి కేంద్ర మంత్రి ప్రణబ్ సిగ్గుపడుతున్నారని ఆయన విమర్శించారు. వెంకయ్యనాయుడు, కాని బిజెపి అగ్రనేతలు ఎల్.కె.అద్వాని, నితిన్ గడ్కరి వంటి వారు రాందేవ్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చి నిరసన కార్యక్రమాలకు దిగడంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది.అయితే బిజెపి ముందుగా నల్లధనం విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసిందో చెబితే బాగుంటుంది. ఒకపక్క కర్నాటకలో గాలి జనార్ధనరెడ్డి వంటి మంత్రులకు పెద్ద పీట వేస్తూ, మరో పక్క నల్లధనం గురించి వెంకయ్యనాయుడు కాని, మరెవ్వరైనా కబుర్లు చెబితే జనం నమ్ముతారా? అన్నది ప్రశ్న. కనుక వెంకయ్యనాయుడు గారు ముందుగా గాలి జనార్ధనరెడ్డితో తనకు ఎలాంటి అక్రమ లావాదేవీలు లేవని, లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మ స్వరాజ్ చేసిన ఆరోపణలలో తనకు సంబంధం లేదని వెంకయ్యనాయుడు చెప్పగలిగితే , అవినీతికి వ్యతిరేకంగా ఈయన కూడా గట్టిగా మాట్లాడుతున్నారని
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment