నేడు నెల్లూరు

Thursday, September 30, 2010

ఓదార్పులో పాల్గొంటే చర్య: సోమిరెడ్డి

రాష్ట్రంలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోందని, అధికార పార్టీలోని సీనియర్ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. బుధవారం స్థానిక ఇరిగేషన్ శాఖ అతిథి గృహంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి పచ్చి మోసగాడని, గెలిచిన వారం రోజుల్లోపే డబ్బులకు కక్కుర్తి పడి ఆకర్షణ పేరుతో పార్టీ వీడారన్నారు.

జగన్ ఓదార్పుకు టీడీపీ నాయకులు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని, మద్దతు పలికిన వారంతా ప్రసన్న మనుషులేనన్నారు. ఒకవేళ ఎవరైనా ఓదార్పులో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No comments: