నేడు నెల్లూరు

Thursday, September 30, 2010

చీటీల పేరుతో ఘరానా మోసం

నగరంలోని ఓ ప్రైవేట్ చీటీల నిర్వాహకుడు రూ. 4 కోట్లకు పైగా దండుకుని కుంటుంబ సభ్యులతో పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌస్‌పేటకు చెందిన మల్యాద్రి ప్రైవేటుగా చీటీలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు పెద్ద మొత్తంలో చీటీలు నిర్వహించడం, అధిక వడ్డీకి రుణాలు తీసుకుని, తిరిగి చెల్లిస్తూ వ్యాపారలావాదేవీలు సాగిస్తూ నగరంలో పలువురి వద్ద నమ్మకాన్ని సంపాదించుకున్నాడు.
ఆ నమ్మకంతోనే తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాల క్రితం ట్రావ్‌ల్ వ్యాపా రం ప్రారంభించాడు. అందులో టెంపోలు, పలు రకాల కార్లు పెట్టి బాడుగలకు తిప్పడం చేసేవాడు.

అంతే కాకుండా తనకు అప్పులిచ్చిన వారికి వాహనాలు అవసరమైతే ఉచితంగా పంపేవాడు. ఇలా నమ్మకంగా వ్యవహరిస్తూ అతను బయట అధిక మొత్తంలో వేసిన చీటీలన్నీ పాడుకున్నాడు. అలాగే తన వద్ద చీటీలు వేసిన వారికి చెల్లింపులు నిలిపి వేసి, తిప్పడం ప్రారంభించాడు. ఇలా ఎవరికి అనుమానం రాకుండా తన కార్యకలాపాలను సాగిస్తూ వచ్చాడు. ఇలా పలువురికి చెందిన రూ.4 కోట్లకు పైగా సొమ్ముతో బుధవారం ఇంటికి తాళం వేసి, కుటుంబసభ్యులతో పరారయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితులు అతని సెల్‌ఫోన్లకు పోన్ చేస్తే అవి పని చే యడం లేదు. దీంతో అతనికి వడ్డీకి నగదు ఇచ్చిన వారు, చీటీలు వేసిన వారు, అతను పాడుకున్న చీటీల నిర్వాహకులు స్టోన్‌హౌస్‌పేటలోని అతని ఇంటికి పరుగులు తీశారు. అక్కడ ఇంటికి వె ళ్లి చూస్తే తాళం వేసి ఉండటంతో ఊసురోమంటూ వెనుదిరిగారు.

No comments: