ఉదయగిరి,సెప్టెంబరు29 : కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి గోడ మీద పిల్లి లాగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రస్తానం కలిగిన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును చెడగొడుతున్నాడని జిల్లా దేశం పార్టీ అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం ఉదయగిరి నీటిపారుదల శాఖ అతి«థిగృహంలో నియోజకవర్గస్థాయి దేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సోమిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల జరుగుతున్న కక్షసాధింపు చర్యలను చూస్తూ ఊరుకోబోమన్నారు.
జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డిలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. జిల్లాలో రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకొంటుంటే ఎంపీ, మంత్రి ఏమీ పట్టనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు సహాయసహకారాలు అందిస్తానని చెప్పగా పమిడి రవికుమార్ 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
Thursday, September 30, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment