నేడు నెల్లూరు

Thursday, September 30, 2010

ప్రజానేత ఆనం వెంకటరెడ్డి

మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కల్మషంలేని వ్యక్తి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరం రామలింగాపురం కూడలి వద్ద బుధవారం ఉదయం నిర్వహించిన ఆనం వెంకటరెడ్డి 101వ జయంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 16 ఏళ్ల ప్రా యంలో ఉన్నప్పుడు 1956లో మైపాడులో నిర్వహించిన రాజకీయ శిక్షణ శి బిరంలో ఆనం వెంకటరెడ్డి పరిచయమయ్యారని గుర్తు చేసుకున్నారు.

వెంకట రెడ్డి కల్మషంలేని మనిషని ఆయన కొనియాడారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏసీ సుబ్బారెడ్డి వెనుక అదృశ్యశక్తి వెంకటరెడ్డేనన్నారు. వెంకటరెడ్డి కాలంలో గ్రూపు రాజకీయాలను ప్రస్తావిస్తూ ఎంతగా విభేదాలున్నా పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ ప్రయత్నించేవారు కాదన్నారు. ఆనం కుటుంబం దశాబ్దాల పాటు రాజకీయాల్లో రాణించడానికి ప్రజలతో మమేకం కావడమేనన్నారు.

మహోన్నత నేత డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఆస్తి అని పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం పేర్కొన్నారు.

ఆనం వెంకటరెడ్డి జయంతి సభలో ఆయన మాట్లాడుతూ నేటి తరం నాయకులు వెంకుబాబు(ఆనంవెంకటరెడ్డి)ని ఆదర్శంగా తీసుకొని, రాజకీయ విలువలు కాపాడాలని సూచించారు. ఏసీ సంపూజన సమితి ట్రస్టు అధ్యక్షుడు నాగారెడ్డి హరిశ్చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జయంతి సభలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు.

నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల క్రితమే నె ల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం ఆనం వెకంటరెడ్డి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బూదాటి రాధయ్య, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నగర మేయర్ నంది మండలం భానుశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల శ్రీహరి నాయుడు, మాగుంట పార్వతమ్మ, కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి, సీవీ శేషారెడ్డి, ఏసీ సంపూజన సమితి ట్రస్టు సభ్యుడు ఎల్‌వీ కృష్ణారెడ్డి, వేమారెడ్డి శ్యామసుందరరెడ్డి, పత్రి రవీంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు చాట్ల నరసింహారావు, ఆనం విజయకుమార్‌రెడ్డి, వేమారెడ్డి రఘునందన్‌రెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆనం వెంకటరెడ్డి జీవిత చరిత్రపై ఏసీ సంపూజన సమితి వెలువరించిన ‘అందరికీ ఆప్తుడు’ పుస్తకాన్ని మంత్రి గాదె వెంకటరెడ్డి ఆవిష్కరించారు. వీఆర్ కళాశాల విశ్రాంత తెలుగు శాఖాధ్యక్షుడు మెట్టు రామచంద్రప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించారు. ఉత్తమ దిగుబడులు సాధించిన వేగూరు పరమేశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి, రమణయ్య, లేబూరు పరమేశ్వరరెడ్డి, కాసా ఎల్లారెడ్డి, నంబూరు గజేంద్రరావు, నాగిరెడ్డి రామకృష్ణారెడ్డి, సూరం మాల కొండారెడ్డి తదితర రైతులను మంత్రి సత్కరించారు.

No comments: