నగరంలోని వెంకటేశ్వరపురం పరిధిలో గల జనార్దన్రెడ్డి కాలనీలో చీటీల పేరుతో ఓ మహిళ దాదాపు అరకోటి స్వాహా చేసి మాయమైంది. ఈఘటన సోమవారం వెలుగుచూసింది.
బాధితుల కథనం మేరకు.. జనార్దన్రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న ఆషా అనేక ఏళ్ళగా చిటీల వ్యాపారం చేస్తుంది. పేద, మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్న కాలనీలో అందరితో నమ్మకంగా ఉంటూ దాదాపు రూ.అరకోటి వసూలు చేసింది. చిటీల కాలం పూర్తి అయినా తన వద్దే ఉంచితే వడ్డీ వేసి సొమ్మును ఇస్తానంటూ కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చిం ది. ఈ నేపథ్యంలో కొందరు డబ్బులు అవసరమై చిటీల సొమ్ము ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు.దీంతో తను ఎవరికి డబ్బులు ఇవ్వననీ.... ఎవరికి చెప్పుకుంటారో చెప్పడంటూ తెగేసి సమాధానం చె ప్పింది.
డబ్బులు అడిగితే కేసులు
ఎవరైనా గట్టిగా అడిగితే కేసులు పెడుతోందని బాధితులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఓ పది మంది బాధితులు కలిసి ఆమె ఇంటి వద్దకు వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడిగారు. దీంతో వారందరిపై దాడి, తదితర కేసులు పెట్టింది.
ఈ సంఘటనతో మిగతా వారు ఆమెను డబ్బులు అడిగేందుకు హడలిపోతున్నారు.
నేడు పోలీసులకు ఫిర్యాదు ఆమె వద్ద చిట్టీలు వేసి మోసపోయిన వారందరు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.
Tuesday, December 14, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment