నేడు నెల్లూరు

Friday, June 18, 2010

ఉదయగిరి మేకపాటి జాగిరా...?

ఉదయగిరి నియోజక వర్గాన్ని శాసన సభ్యులు ఆయన జాగిరులా వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కరటంపాడు గ్రామంలో టిడీపి నాయకులు కన్నబాబు నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే రెండువ దశ గెలవడంతో నియోజక వర్గాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని అధికారులను హింసిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు మేకపాటికి కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని దింతో ప్రజలకు అన్ని విధాల అన్యాయం జరుగుతుందని మండి పడ్డారు.

ఎన్నోదఫాలు టీడిపి వాళ్లకు అన్యాయం జరిగినా పోలీసులు స్పందించటం లేదని ఎక్కడైనా కాంగ్రెస్‌ వాళ్లకు చిన్నపొరపాటు జరిగితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. నియోజక వర్గంలో జరిగే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకొని వెళ్లి ఉన్నామని అయినా అధికారుల్లో మార్పులు కనిపించటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఓవైపు ఎక్కడ ఏమి జరిగినా స్పందించే రెవెన్యూ ఉద్యోగులు ఉదయగిరి నియోజక వర్గంలో వాళ్ల అధికారులను మేకపాటి ఇబ్బందులు పెడుతున్నా స్పందించక పోవటం విడ్డూరంగా ఉందని అన్నారు. మర్రిపాడు మండలం వాళ్ల సొంత మండల కావడంతో చట్టాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని అధికారులను బానిసలుగా చేస్తున్నారని మండి పడ్డారు. అధికారులు సైతం ఏకపక్షంగా పనిచేస్తున్నారని అన్నారు. హద్దు మీరితే మేముకూడా సిద్ధంగా ఉన్నామని అన్ని రోజులు ఒకేలా ఉండవని హెచ్చరించారు.

No comments: